‘‘సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఈ రోజు ఉన్న రంగు రెండో రోజు ఉండకపోవచ్చు. కళారంగంలో వచ్చిన పనిని నిజాయతీగా చేయాలి. తెలియని విషయాన్ని అడిగి మరీ నేర్చుకోవాలి. లేదంటే ఇక్కడ నిలబడటం కష్టం. యాక్టింగ్లో కూడా యాక్ట్ చేస్తే కెరీర్లో దెబ్బతింటాం’’ అని చెబుతున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్న ఆమె తమిళ, హిందీ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. తమన్నా మాట్లాడుతూ ‘‘యాక్టింగ్ అనేది రెండు, మూడేళ్ల కోర్స్ కాదు. పుస్తకం చదివి పూర్తి చేయడానికి. నిత్య విద్య ఇది. నేర్చుకునేకొద్దీ నటన సాగుతూనే ఉంటుంది. అంకితభావంతో పని చేస్తేనే ఆర్టిస్ట్గా పరిణితి సాధించగలం. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి వచ్చే ఏడాదికి 15 ఏళ్లు పూర్తవుతోంది. 50కు పైగా సినిమాల్లో నటించా. సినిమా సినిమాకూ నటన నేర్చుకుంటూనే ఉన్నా. అందుకే ఇంతకాలం ఇక్కడ ఉండగలిగా’’ అని తెలిపారు.
నిజాయితీగా ఉండటమే…
Related tags :