Movies

సంబంధం మారింది

The official relation now is actress and producer

నయనతార కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెడితే… అతడి దర్శకత్వంలో ఆమె ‘నేనూ రౌడీ నే’ చిత్రం చేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో తమిళ చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు కాదు. నిర్మాత మాత్రమే. ‘నేనూ రౌడీ నే’కి వీరిద్దరి మధ్య రిలేషన్‌ హీరోయిన్‌-డైరెక్టర్‌ అయితే… తాజా చిత్రానికి హీరోయిన్‌-ప్రొడ్యూసర్‌ అన్నమాట. ప్రొఫెషనల్‌గా రిలేషన్‌ మారిందన్నమాట! వ్యక్తిగత జీవితంలో వీరిద్దరి మధ్య బంధంలో ఏ మార్పూ లేదన్నది తమిళ సినిమా వర్గాల ఖబర్‌. థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న తాజా చిత్రానికి ‘అవళ్‌’ ఫేమ్‌ మిళింద్‌ రావు దర్శకుడు. వచ్చే నెలాఖరున లేదా అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి కథానాయికగా నయనతారను మాత్రమే ఎంపిక చేశారట. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నారట. తెలుగు సినిమా సంగతులకు వస్తే… చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’లో నయనతార నటించిన సంగతి తెలిసిందే