ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం విడుదలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ చిత్రం విడుదలకు హైకోర్టు మళ్లీ బ్రేక్ వేసింది. ఈ మూవీ ప్రివ్యూ చూసిన ప్రిలిమినరీ కమిటీ సినిమా విడుదలకు అడ్డుచెప్పింది. కొంత మంది వ్యక్తులను కించపరుస్తున్నట్టు ఈ సినిమా ఉందని హైకోర్టు కు ప్రిలిమినరీ కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రిలిమినరీ కమిటీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వాటిని రివైజ్ కమిటీని సరిచేసిన తర్వాతే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయం జరగలేదని భావిస్తే పిటిషనర్ మరోమారు పిల్ దాఖలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. కాగా, ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తీసేశామని కోర్టుకు చిత్ర బృందం తెలిపింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం అభ్యంతరకర సన్నివేశాలు తొలగించినట్టు ఎక్కడా లేదని, కేవలం మ్యూట్ లో మాత్రమే ఉంచారని, అలా చేస్తే సరిపోదని హైకోర్టు తేల్చి చెప్పింది.
వర్మకు హైకోర్టు బ్రేకులు

Related tags :