Business

గృహనిర్మాణదారులకు శుభవార్త

Cement Production Begins Soon In India After LockDown

లాక్‌డౌన్‌ కారణంగా సిమెంట్‌ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేసిన అంబుజా, ఏసీసీ, ఐసీసీ, జేకే లక్ష్మీ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌ సంస్థలు ఈ నెల 20 నుంచి దశలవారీగా తమ ఉత్పత్తిని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాయి. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం నిర్దేశించిన సామాజిక దూరాన్ని పాటిస్తూనే మళ్లీ ఉత్పత్తి మొదలుపెట్టనున్నట్టు ఆ సంస్థలు తెలిపాయి. ఇదేవిధంగా ఈ నెల 20 నుంచి తమ అన్ని శాఖలను తెరువనున్నట్టు ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ ప్రకటించింది.