Movies

విజయనిర్మలగా కీర్తి సురేష్

విజయనిర్మలగా కీర్తి సురేష్

నటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎన్ని సినిమాలు చేసినా.. ‘మహానటి’ అనే చిత్రంలోని ఆమె నటనకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆరాధించే నటి సావిత్రి బయోపిక్‌లో కీర్తి సురేష్ జీవించేసింది. ఆ తర్వాత అందరూ ఆమెని కీర్తి సురేష్ అనడం మానేశారు అంటే.. ఎంతగా ఆమెకు ఆ చిత్రం పేరు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అలాంటి మరో బయోపిక్‌లో మరోసారి కీర్తి నటించబోతుంది అంటూ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.ఈ బయోపిక్ ఎవరిదో కాదు. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల బయోపిక్‌లో కీర్తిసురేష్‌ను నటించాల్సిందిగా ఆమె కొడుకు నరేష్ కోరుతున్నాడట. ఇటీవల విజయనిర్మల మృతి చెందిన విషయం తెలిసిందే. టాలీవుడ్ చిత్ర సీమకు ఆమె ఎంతో సేవ చేశారు. హీరోయిన్‌గా, దర్శకురాలిగా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడామె బయోపిక్ అంటే క్రేజ్ మాములుగా ఉండదు. ఆ క్రేజ్‌ని అందుకోవాలంటే కీర్తిసురేషే కరెక్ట్ అని భావిస్తున్నారట. మరి మహానటి బయోపిక్ తర్వాత ఇక బయోపిక్‌లు చేయనని ఖరాఖండీగా చెప్పిన కీర్తిసురేష్ ఈ బయోపిక్‌లో నటిస్తుందో, లేదో తెలియాల్సి ఉంది. అయితే ఈ బయోపిక్ గురించి అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం బయటికి రాలేదు.