NRI-NRT

కరోనా బాధితులకు మలేషియా ఎన్నారై తెరాస సాయం

Malaysia NRI TRS Helps Poor People In Malaysia And India

తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మలేషియా ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా కష్టసమయంలో తెరాస మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు నేతృత్వంలో హైదరాబాద్ లో ప్రవీణ్ వర్మ బరపటి ఆధ్వర్యంలో బగ్గీస్ కిచెన్ ద్వారా గత నెలరోజులనుండి నిర్వహిస్తున్న ఆహార పొట్లాల పంపిణీకి ఆర్ధిక సహాయాన్ని అందించింది. మలేషియాలో చిక్కుకున్న దినసరి కార్మికులకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించింది. తెరాస 20వ వసంతాన్ని పురస్కరించుకొని కోర్ కమిటీ సభ్యుడు ముల్కల శ్రీనివాస్ దగ్గరలో ఉన్న నాలుగు అనాథ శరణాలయాలకు నిత్యవసర వస్తువులను అందజేయడం జరిగింది. దీనిపై తెరాస మలేషియా కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అబినందించారు. ఇలా వారి దృష్టికి వచ్చిన సమస్యలను కమిటీ ఉపాధ్యక్షులు మారుతి కుర్మ,కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి లతో కాన్ఫిరెన్స్ కాల్ లో చర్చిస్తూ వారి సహాయంతో పరిష్కరిస్తున్నారు.