Sports

కుస్తీ శిక్షకులకు జీతాల కోత

Indian Wrestling Coach Salary Cuts Due To COVID19

కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పనిచేసే విదేశీ కోచ్‌లకు కూడా మినహాయింపు దక్కలేదు. భారత రెజ్లింగ్‌ జట్టు కోచ్‌లు ఆండ్రూ కుక్, టెమో కజరష్విలీ ఏప్రిల్‌ నెల జీతాలే అందుకోలేదంటా. మార్చి నెలకు కూడా సగం జీతం మాత్రమే పొందినట్లు వారు తెలిపారు. తమ వేతనాల కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్లూఎఫ్‌ఐ) జాతీయ శిబిరాన్ని మార్చి 17న రద్దు చేయడంతో మహిళల కోచ్‌ కుక్‌ అమెరికాకు, గ్రీకో రోమన్‌ కోచ్‌ కజరష్విలీ జార్జియాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) నుంచి వేతనం పొందలేదన్నారు. అయితే కోచ్‌ల వేతనాలు చెల్లించాలంటూ ‘సాయ్‌’కు సూచించినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్‌ సెక్రటరీ వినోద్‌ తోమర్‌ తెలిపారు.