NRI-NRT

ఒమన్‌లో మృతిచెందిన ప్రవాస భారతీయుడికి ముస్లింల అంత్యక్రియలు.

Oman Hyderabadi Muslims Do Final Rituals Of Hindu Indian Who Died Due To Corona

ఒమన్ దేశంలో కరోనా సోకి మృతి చెందిన హిందు ప్రవాస భారతీయుడికి హైదరాబాద్‌కు చెందిన ముస్లిం యువకులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి ఆ దేశంలో బంధువులు స్నేహితులు ఎవరూ లేని కారణంగా హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ సోషల్ క్లబ్ సభ్యులు సొహైల్ ఖాన్, సంజీత్ కనోజియా, జాఫ్రీ, ఒబాయిది, తమీంలు చొరవ తీసుకుని అతడికి తుదివీడ్కోలు పలికారు. ఐకమత్యానికి చిహ్నంగా వీరు చేసిన ఈ సేవా కార్యక్రమానికి ఒమన్ ఎన్నారై తెరాస అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.