ScienceAndTech

ఇది దుర్గమ్మ “విజయ” రాజసం

ఇది దుర్గమ్మ “విజయ” రాజసం

విజయవాడ కనకదుర్గమ్మకు మణిహారంగా భాసిల్లుతున్న పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఇంద్రకీలాద్రికి ఇది ఒక ఆభరణంలా కనిపిస్తోంది. విజయవాడ- హైదరాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు తీర్చడానికి ఈ వంతెన పనులకు 2015లో శ్రీకారం చుట్టారు. నవీన సాంకేతికతతో ఆరు వరుసల్లో దీన్ని నిర్మించారు. సెప్టెంబరు 4న కేంద్ర మంత్రి గడ్కరీ దీన్ని ప్రారంభించనున్నారు. నది ఉపరితలం నుంచి డ్రోన్‌ చిత్రీకరించిన ఈ దృశ్యం కనువిందు చేస్తోంది.