థ్రిల్లర్ సినిమాల నిపుణుడు కె.వి.గుహన్ దర్శకత్వంలో మరో క్రైమ్థ్రిల్లర్ చిత్రం రాబోతోంది. కళ్యాణ్రామ్ హీరోగా ‘118’తో తెరకెక్కించి సత్తా నిరూపించుకున్నారాయన. ఈసారి సైబర్క్రైమ్ ఆధారంగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు. డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ(ఎవరు, ఎక్కడ, ఎందుకు) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఈ సినిమా టీజర్ను సూపర్స్టార్ మహేశ్బాబు తాజాగా విడుదల చేశారు. టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఎవరు, ఎక్కడ, ఎందుకు?

Related tags :