న్యూజెర్సీ సాయిదత్త పీఠం సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఆటా( అమెరికన్ తెలుగు అసోసియేషన్) సంస్థతో కలిసి సాయి దత్త పీఠం ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. సాయి దత్త పీఠం వాలంటీర్లు, హైస్కూల్ విద్యార్ధులు తమ ఇరుగు, పొరుగువారితో పాటు స్నేహితుల ఇళ్ల నుంచి ఫుడ్ ఐటమ్స్ సేకరించారు. ఇలా సేకరించిన ఆహారాన్ని పేద పిల్లలకు అందించనున్నారు. సాయి దత్త పీఠం సేవా దళ సభ్యులతో పాటు స్థానిక దాతలు లావణ్య, జగదీశ్ యలమంచిలి, చారిటీ టీం సభ్యురాలు శుభ పాటిబండ్ల, దిశా గార్గ్, ఎస్.డి.పి వాలంటీర్స్, సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి, న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, సాయి దత్త పీఠం కార్యనిర్వాహక సభ్యులు అశోక్ బడ్డీ, మురళీ కృష్ణ మేడిచెర్ల, శుభ పాటిబండ్ల, వంశీ గరుడ, ఆటా రీజియన్ కోఆర్డినేటర్స్ సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్టా, ప్రవీణ్ ఆళ్ల, ఆటా సేవా టీం కోచైర్ విలాస్ జంబు తదితరులు పాల్గొన్నారు.
సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

Related tags :