Devotional

తమిళనాడులో పురాతన వెంకన్న విగ్రహం లభ్యం

తమిళనాడులో పురాతన వెంకన్న విగ్రహం లభ్యం

తమిళనాడులో బయటపడిన అతి పురాతన వేంకటేశ్వర స్వామి విగ్రహం .. !

తమిళనాడు రాష్ట్రంలో అతి పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది . అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో వేంకటేశ్వర స్వామి విగ్రహం బయల్పడింది . కారయంకురిచి గ్రామానికి చెందిన శరవణన్ తనకు చెందిన స్థంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపించాడు . ఈ క్రమంలో రాతి విగ్రహం తగిలినట్లుగా కనిపించడంతో జాగ్రత్తంగా తవ్వకాలు జరిపారు . పూర్తిగా తవ్వి చూడగా .. సుమారు ఎనిమిది అడుగుల స్వామివారి రాతి విగ్రహం కనిపించింది . దాంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు . అధికారులు జేసీబీని రప్పించి .. జేసీబీ సహాయంతో విగ్రహాన్ని జాగ్రత్తగా వెలికి తీశారు . గ్రామస్తులు స్వామివారి విగ్రహాన్ని నీటితో శుభ్రపరిచి ..

అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా , స్వామి వారి పురాతన విగ్రహాన్ని అధికారులు తిరుచ్చిలోని పురావస్తు శాఖ కార్యాలయానికి తరలించడానికి ప్రయత్నించగా .. గ్రామస్తులు నిరాకరించారు . విగ్రహాన్ని తరలించేందుకు అంగీకరించలేదు . సీనియర్ అధికారులు ఎంటరై .. గ్రామస్తులతో చర్చలు జరిపించారు . విగ్రహం తరలింపునకు గ్రామస్తులను ఒప్పించారు . అనంతరం స్వామి వారి విగ్రహాన్ని అధికారులు తరలించారు . ఈ పురాతన విగ్రహానికి సంబంధించిన వివరాలు పరిశోధన తరువాత వెల్లడిస్తామని గ్రామస్తులకు అధికారులు హామీ ఇచ్చారు .

ఇదిలా ఉంటే .. తిరుమలలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి మూల విరాట్ దాదాపు 9 అడుగులు ఉంటుంది . ఇప్పుడు తమిళనాడులో బయటపడ్డ విగ్రహం 8 అడుగుల పొడవు ఉంది . కాగా , శ్రీవారి విగ్రహం లభ్యమైన ప్రదేశం శ్రీరంగం పట్టణానికి సరిగ్గా 78 కిలోమీటర్ల దూరంలో ఉంది . అయితే , అత్యంత పురాతన విగ్రహం లభ్యమవడంతో ఇప్పుడు అందరి దృష్టి శ్రీవారి విగ్రహంపైనే పడింది . మరి విగ్రహం ఏ కాలానికి చెందినది , ఎవరు చేయించారనేది తేలాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే .