DailyDose

చైత్ర హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య-నేరవార్తలు

చైత్ర హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య-నేరవార్తలు

* సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

* కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఉద్రిక్తత.నాలుగు రోడ్లు కూడలి వద్ద జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.తీవ్రగాయాలతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

* విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఊటపల్లిలో కిడ్నాప్‌నకు యత్నం జరిగింది. ముగ్గురు పాఠశాల విద్యార్థినులను కిడ్నాప్‌ చేసేందుకు ముగ్గురు దుండుగులు ప్రయత్నించారు. ఊటపల్లి నుంచి మెరకముడిదాం ఉన్నత పాఠశాలకు విద్యార్థులు సైకిల్‌పై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను ట్రై సైకిల్‌ వాహనంలో ఎక్కిస్తుండగా వాహనదారులు గమనించి గ్రామస్థులకు సమాచారమివ్వగా.. వారిని బంధించారు. భక్తుల వేషధారణతో కిడ్నాప్‌నకు యత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో బలగాలకు తారసపడిన మావోయిస్టులు. ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు. మావోయిస్టు అగ్ర నాయకుడు తప్పించుకున్నట్లు ఒడిశా పోలీసుల వెల్లడి.

* వాచ్‌మెన్‌ కూతుళ్లపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఈ నెల 12వ తేదీన సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లోని విష్ణు బ్లూ లోటస్‌ అపార్ట్‌మెంట్స్‌ సమీపంలో నివసించే ఓ వాచ్‌మెన్‌ ఇంటి వద్దకు ఓ యువకుడు బైక్‌ వచ్చాడు. అక్కడే ఉన్న వాచ్‌మెన్‌ కుమారుడిని అడిగి బాత్రూంకు వెళ్ళాడు. అనంతరం బాత్రూం నుంచి బయటకు వస్తూ.. అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న వాచ్‌మన్‌ కూతుళ్ల వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ ఇద్దరు బాలికలు భయపడి గదిలోకి వెళ్లగా.. ఆ యువకుడు కూడా గదిలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో వారు పెద్దగా కేకలు వేశారు. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ అపార్ట్‌మెంట్‌ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ మేరకు అపార్ట్‌మెంట్‌ యజమాని ఖాజా ఆసిఫ్‌ అహ్మద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు గుర్తు తెలియని యువకుడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.