1. చిత్తూరు జిల్లా : తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం : అలివేలుమంగాపురం/తిరుచానూరు.
తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంకి 5km దూరంలో ఉంది. లిమేలు మంగమ్మ పుట్టినిల్లుగా తిరుచానూరు ప్రసిద్ది. దీన్నే ‘అలమేలు మంగాపురం’ అని కూడా పిలుస్తుంటారు. క్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగమ్మ కొలువై ఉంటుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోక ముందే తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలం లభించదని పెద్దలు చెబుతారు.
**** ఈ ఊరు పేరు తిరుచానూరు ఎందుకు అయింది ?
ఇది ఒకప్పుడు శ్రీ శుఖ మహర్షి ఆశ్రమం కనుక దీనిని శ్రీ శుకనూరు అని పిలిచేవారు. ద్రావిడ భాషలో ” శ్రీ ” అంటే శ్రీకరం, పవిత్రం అని అర్థం. కనుక ఇది ఆ తర్వాతి కాలంలో తిరుశుకనూరు అయ్యింది…అదే కాలక్రమేణా “తిరుచానూరు” అయింది. తిరుచానూరు అంటే పవిత్రమైన కోనేరు కల ఊరు అనే అర్థం కూడా ఉంది శాసనాలలో.
*ఈ ఊరు పేరు ” అలివేలు మంగాపురం” ఎందుకు అయ్యింది ?
ద్రావిడ బాషలో అలర్ అంటే తామరపువ్వు, “మేల్ “అనగా పైన,” మంగై” అంటే మంచి అందమైన స్త్రీ.
అనగా…తామరపువ్వు పైన ఉద్బవించిన మంచి స్త్రీ అని అర్థం.
* తిరుమల యాత్రలో ముందుగా ఆ తల్లినే ఎందుకు దర్శించాలి ?
లోకంలో మొదట మనం మన భాదలు, కోరికలు మన అమ్మ తోనే చెప్పుకోవాలి, అప్పుడే తండ్రి దగ్గర మన పని సులువుగా అవుతుంది. బిడ్డ తన బాధ తల్లికి చెప్పుకుంటే… ఆ తల్లి బిడ్డ తరఫున తండ్రి తో వాదించి, నచ్చజెప్పి ఆ తండ్రి చేత బిడ్డకు కావాల్సిన కోరికలు తీర్చేలా చేసేది అమ్మే కదా. మరి అమ్మలకన్న అమ్మ అలివేలు మంగమ్మ కనుక ముందుగా ఆ అమ్మని దర్శించి మనం తిరుమల యాత్రకు వచ్చిన కారణం ఆ తల్లితో నివేదించి స్వామివారికి చెప్పి ఒప్పించి కరుణించమని వేడుకుంటే చాలు , మన పని ఐపోయినట్టే ! ఆ తర్వాతే మనం తిరుమల లో స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్థలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ అమ్మ ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది.
** ఈ తల్లి యొక్క వాత్సల్యం ఏమిటి ?
వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, “వాత్సమ్” అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, “ల” అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది.
*** స్థల పురాణం :
తిరుమల క్షేత్రం స్థలపురాణం ప్రకారం వైకుంఠంలో త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ. మరొక కథనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా అయినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది.భూదేవియే గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాధుని వరించింది. ఈమెను ఆండాళ్, ఆముక్త మాల్యద (తాల్చి ఇచ్చిన తల్లి), చూడి కొడుత నాచియార్ అని కూడా అంటారు. భూదేవి స్వరూపమే సత్యభామ అనికూడా పురాణ కథనం గమనించాలి
అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవికి చతుర్భుజాలు. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి.ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు శ్రీకృష్ణ బలరాములు, శ్రీ సుందరరాజస్వామి, శ్రీనివాసుడు 12 సంవత్సరాల తప్పసు చేసే ముందు తన స్వహస్థలతో ప్రతిష్ట చేసిన శ్రీ సూర్యనారాయణ ఆలయం తప్పక దర్శించాలి. ఇది పద్మ సరోవరం ఎదురుగా ఉంటుంది.కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.
అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, కుంకుమ పూజ , ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు.
______________________@
2. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.41,79,905
అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవాల అనంతరం శుక్రవారం స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ లెక్కింపులో స్వామివారి ప్రధాన ఆలయ హుండీ ఆదాయం రూ.40,70,878 వచ్చింది. అలాగే అన్నదాన హుండీ ఆదాయం రూ.29,152, గుర్రాలక్కమ్మ హుండీ ఆదాయం రూ.79,875 రాగా మొత్తం 30 రోజులకుగాను స్వామివారి హుండీల ఆదాయం రూ.41,79,905 వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
3. మల్లన్న హుండీ ఆదాయం 2.62 కోట్లు
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపేణా రూ.2,62,74,717 లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ కూడా వచ్చిందన్నారు. ఈ కానుకలను భక్తులు 38 రోజులలో సమర్పించారు.
4. కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురంలో ఉన్న కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరగనుంది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఆదివారం నుంచి ఈనెల 28వ తేదీవరకు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి 9.20 గంటల మఽధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది.కాగా బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆలయాధికారులు, అర్చకులు శుక్రవారం ఆహ్వానించారు. డిప్యూటీ ఈవో శాంతి, అర్చకులు బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు తదితరులు పాల్గొన్నారు.
5. వేములవాడ సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారి దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. శుక్రవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. ఆలయ కళాభవన్లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీ దేవి ఆలయంలో కుంకుమపూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
6. సీఎంకు శ్రీశైలం దేవస్థానం ఆహ్వానం
శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని దేవదాయశాఖ మంత్రి, దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ని కలిసిన వారు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
7. యాదాద్రిలో శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా
యాదాద్రి (Yadadri ) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడింది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అయితే ఆలయాభివృద్ధిలో బాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడంతో నారసింహ మహాయాగాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
8. తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరగుతోంది.టీటీడీ గంటకు 1500 చొప్పున టికెట్లను మంజూరు చేస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు.శుక్రవారం తిరుమల శ్రీవారిని 35,584 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.85 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 18,608 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
9. మేడారం సమ్మక్క సారాలమ్మలను దర్శించుకొనున్న గవర్నర్ తమిళిసై
మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. శనివారం రాత్రి సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో నాలుగు రోజుల జాతరకు తెరపడనుంది.వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు నిర్విరామంగా అమ్మవార్లను అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు సమ్మక్క సారలమ్మ దేవతలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకోనున్నారు.రెండేండ్లకోసారి జరిగే ఈ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. వన దేవతలను ఘనంగా స్వాగతించడం, గద్దెలపై ప్రతిష్ఠించి మొక్కులు సమర్పించడం, నాలుగో రోజు వన ప్రవేశం చేయించడం ఆదివాసీ సంప్రదాయం. అమ్మవార్ల వన ప్రవేశంతో మేడారం మహాజాతర పరిసమాప్తమవుతుంది. సమ్మక్క సారలమ్మల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తున్నారు.
10. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం..
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి రేపటి నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని శుక్రవారం అధికారులు ఆహ్వానించారు.ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, అర్చకులు బాలాజీ, సూపరింటెండెంట్ ముని చెంగలరాయులు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో చైర్మన్ ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.అదేవిధంగా నాగలాపురం మండలం సురుటుపల్లి లోని శ్రీపల్లి కొండేశ్వర స్వామి వారికి ఈనెల 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు టీటీడీ చైర్మన్ ను ఆహ్వానించారు.