అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించినట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విటర్లో పోల్ నిర్వహించగా.. 1.5 కోట్ల మంది పాల్గొన్నారని, వారిలో 51.8ు మంది ట్రంప్ ఖాతా పునరుద్ధరణకు అనుకూలంగా ఓటు వేశారని వివరించారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి పాల్పడ్డ ఘటన తర్వాత ట్రంప్ ఖాతాను ట్విటర్ శాశ్వతంగా తొలగించింది. సొంతంగా ‘ట్రూత్ సోషల్’ అనే మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ను రూపొందించుకున్న ట్రంప్ మళ్లీ ట్విటర్ ఖాతాను వాడుతారా? లేదా? అనేది నెట్టింట చర్చనీయాంశమైంది.
ట్రంప్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ
