Politics

మజ్లిస్‌కు బీఆర్‌ఎస్‌ ఆఫర్‌?

మజ్లిస్‌కు బీఆర్‌ఎస్‌ ఆఫర్‌?

హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం విషయంలో ఎంఐఎంకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఎంఐఎం చేతిలో ఉన్న స్థానాన్ని అధికార పార్టీ తనకే వదిలేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.బీఆర్‌ఎస్‌కు ఉన్న కార్పొరేటర్ల బలంతో ఆ స్థానాన్ని గెలుచుకోవచ్చు.అయితే బీఆర్‌ఎస్ సీటును వదిలేస్తుందనే చర్చ సాగుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు పలువురిని ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.50 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని చెబుతున్నారు.ఆ పదవిని ఎంఐఎంకు ఎందుకు వదిలేయాలని కొందరు బీఆర్‌ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.హైదరాబాద్ ఎమ్మెల్సీ పదవీకాలం త్వరలో ముగియనుంది.తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఆ పదవిని వదులుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఎంఐఎం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి గులాబీ పార్టీకే మద్దతు ఇస్తోంది.ఎంఐఎం మద్దతుతో బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో గెలిచిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ తక్కువ సీట్లు సాధించినా ఎంఐఎంతో కలిసి అధికారంలోకి వచ్చింది.రెండు పార్టీలు రాజకీయ అవగాహనతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి.తాజాగా తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం చెప్పింది.టీ-బీజేపీ అధినేత బండి సంజయ్ 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్నారు.
ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తే పరిస్థితి ఏమిటన్న చర్చ బీఆర్‌ఎస్‌లో జరుగుతోంది.కొన్ని జిల్లాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.ఎంఐఎం పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి.కానీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఆయన వ్యాఖ్యల్లో గందరగోళం నెలకొంది. కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్సీ సీటుపై చర్చ జరిగినట్లు సమాచారం.బీఆర్‌ఎస్‌ ఎన్నికలకు వెళితే ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారనే వివరాలను సేకరించినట్లు సమాచారం.అయితే కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది.