WorldWonders

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్….

అయ్యప్ప భక్తులకు  గుడ్ న్యూస్….

ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు అయ్యప్ప భక్తులకు శుభవార్త తెలిపింది. ఇకపై శబరిగిరీశునికి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా భక్తులు కానుకలు పంపేలా ఈ-కానిక వెబ్​సైట్​ను ప్రారంభించింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ బోర్డు అధ్యక్షుడు అనంత గోపాలన్​ తదితరులు పాల్గొన్నారు. దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్​ ఈ వెబ్​సైట్​ను రూపొందించింది. మొదటి కానుకను ఆ సంస్థ సీనియర్​​ జనరల్​ మేనేజర్​ సమర్పించారు. ఈ-కానిక ద్వారా అయ్యప్పస్వామి గుడికి వచ్చే ఆదాయం పెరుగుతుందని ఆలయ బోర్డు భావిస్తోంది.
మరోవైపు.. శబరిమల క్షేత్రాన్ని జూన్​ 15న తెరవనుండగా ఆ తర్వాత రోజు నుంచి నాలుగు రోజులు స్వామి సన్నిదానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.ఈ క్షేత్రానికి 2022లో భారీగా రూ.330 కోట్ల వార్షికాదాయం సమకూరింది.