Politics

అమిత్‌ షాను చంద్రబాబు కలిస్తే తప్పేమి లేదని సోము వీర్రాజు వ్యాఖ్యలు…

అమిత్‌ షాను చంద్రబాబు కలిస్తే తప్పేమి లేదని సోము వీర్రాజు  వ్యాఖ్యలు…

చంద్రబాబు, బీజేపీ నేతలను కలవడం వెనుక నెగిటివ్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏమైన తెలుసుకోదలిస్తే నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడటం బెటరని వీర్రాజు సూచించారు. తమది జాతీయ పార్టీ అని, తమ వాళ్లను ఎవరినైనా కలుస్తారంటూ సోము వీర్రాజు పేర్కొన్నారు.

ఒకప్పుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో, బీజేపీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, టీడీపీతో పొత్తు ఉండదని గతంలో సోము వీర్రాజు, GVL నర్సింహరావు, సునీల్‌ దేవధర్‌ లాంటి కీలక నాయకులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గత వారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అమిత్‌ షా, నడ్డాను కలిశారు. అయితే, ఎందుకు కలిశారన్నది బయటకు రాకపోయినప్పటికీ.. తెలంగాణ, ఏపీ ఎన్నికల గురించే చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఓ వైపు తెలంగాణ నేతలు టీడీపీ తో పొత్తు ఉండదంటూ పేర్కొంటున్న నేపథ్యంలో.. ఏపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.