పేరు చెప్పగానే నోరూరే ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. అంటే.. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో పూతరేకులు నమోదయ్యాయి. భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు చేసింది. స్పందించిన కేంద్ర విభాగం ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) జర్నల్లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన ఇచ్చింది. అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు ఈనెల 13వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక గుర్తింపు వచ్చినట్లయిందని సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం వివరించింది.400 ఏళ్ల చరిత్ర కలిగిన పూతరేకులు అంతర్జాతీయ గుర్తింపు పొందడం పట్ల ఆత్రేయపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్రేయపురం పూతరేకులకు స్పెషల్ స్టేటస్….
