నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో నిర్మించనున్న రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్లకు సిఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. తన కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.925 కోట్ల వ్యవయంతో ఈ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. క్రిబ్కో విశ్వసముద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్లాంట్లను నిర్మిస్తున్నారు. శంకుస్థాపన అనంతరం కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈ ప్లాంట్ వల్ల స్థానికంగా ఉన్న దాదాపు 75 శాతం యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. సిఎం జగన్ చొరవతో పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగామన్నారు. ప్లాంట్లకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం ఇచ్చామని తెలిపారు. ఈ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అమర్ నాథ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
బయో ఇథనాల్ ప్లాంట్లకు జగన్ శంకుస్థాపన
