WorldWonders

అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ చైనాను అధిగమించింది

అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ చైనాను అధిగమించింది

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల లిస్టును UN ప్రకటించింది. దీని ప్రకారం.. భారతదేశం (1,428.6 మిలియన్లు) ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. అలాగే మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న చైనా.. (1,425.7 మిలియన్లు) రెండో స్థానంలోకి వెళ్లింది. యునైటెడ్ స్టేట్స్ (340 మిలియన్లు), ఇండోనేషియా (277.5 మిలియన్లు) మరియు పాకిస్తాన్ (240.5 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నైజీరియా 223.8 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 6వ దేశం. ఈ జాబితాలో బ్రెజిల్ (216.4 మిలియన్లు) 7వ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ (173 మిలియన్లు), రష్యా (144.4 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.