Politics

ఆర్టికల్​ 370 రద్దు పిటిషన్లపై…ఆగస్టులో పూర్తిస్థాయి విచారణ

ఆర్టికల్​ 370 రద్దు పిటిషన్లపై…ఆగస్టులో పూర్తిస్థాయి విచారణ

కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్-370ని రద్దు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆర్టికల్-370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఆగస్టు 2 నుంచి పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. ఇది వరకు పిటిషనర్లుగా ఉన్న ఐఏఎస్ అధికారి షా ఫైజల్, హక్కుల కార్యకర్త షేహ్లా రషీద్​లు.. ఈ వ్యవహారం నుంచి తప్పుకున్నారు.ఈ నేపథ్యంలో కేసును ఇకపై ‘ఆర్టికల్ 370 ఆఫ్ కాన్​స్టిట్యూషన్​’గా పిలవనున్నట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన వాదప్రతివాదులందరూ జులై 27లోపు తమ లఖితపూర్వక పత్రాలు సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన పిటిషనర్లలో నుంచి తమ పేర్లను తొలగించాలన్న షా ఫైజల్, షేహ్లా రషీద్​ల అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇదివరకు ఈ కేసులో లీడ్ పిటిషనర్​గా షా ఫైజల్ ఉండేవారు. అప్పుడు కేసు పేరును ‘షా ఫైజల్ అండ్ అదర్స్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’గా పిలిచేవారు