Movies

రవితేజ ఫ్యాన్స్‌కు సాలిడ్‌ అప్‌డేట్‌

రవితేజ ఫ్యాన్స్‌కు సాలిడ్‌ అప్‌డేట్‌

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్న రవితేజ… ఈసారి బౌండరీలు దాటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియాకి గురి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వర రావు సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్న మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచే పనిలో ఉన్నారు. ఇప్పటికే టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు రివీల్ చేయడమే కాకుండా ఫస్ట్ గ్లింప్స్ కు వాయిస్ కూడా అందించి, ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చారు. టైటిల్ రివీల్ గ్లిమ్ప్స్ రవితేజ మాములుగా లేడు.

“జింకలను వేటాడిన పులిని చూసి ఉంటావ్. పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా..? ” అని రవితేజ పవర్ ఫుల్ వాయిస్ తో చెప్పే డైలాగ్ గ్లిమ్ప్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్ళింది. గ్లిమ్ప్స్ కే ఇలా ఉంటే మనం పెంచిన పులి ఇప్పుడు వేటాడడానికి సిద్ధమయ్యింది, కాస్త ఓపిక పట్టండి టీజర్ బయటకి వచ్చేస్తుంది అంటూ డైరెక్టర్ వంశీ సూపర్బ్ న్యూస్ చెప్పాడు. రవితేజ ఫాన్స్ టైగర్ నాగేశ్వర రావు టీజర్ కోసం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉండడంతో డైరెక్టర్ వంశీ రెస్పాండ్ అవుతూ త్వరలోనే టీజర్ డేట్ అనౌన్స్ చేస్తాం అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ సమాధానంతో రవితేజ ఫాన్స్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఆ మచ్ అవైటెడ్ టీజర్ టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ఎలాంటి హైప్ పెంచడానికి కారణం అవుతుందో చూడాలి.