Politics

చంద్రబాబు నాయుడు కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం

చంద్రబాబు నాయుడు కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు నుంచి జొన్నాడ వరకు చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపర్చారు. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన బస్సులో ప్రయాణించి మహిళలతో మాట్లాడారు. భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నులపై మహిళలు ఈ సందర్భంగా తమ వేదన వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయని.. తీవ్ర భారంగా మారాయని మహిళలు చంద్రబాబుకు చెప్పారు. మహిళలకు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణంపై హర్షం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన మహా శక్తి పథకం లబ్ధిని మహిళలకు చంద్రబాబు వివరించారు.