Politics

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్​​ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​ను తిరస్కరించింది సర్వోన్నత న్యాయస్థానం. ప్రధాని డిగ్రీ విషయంలో గుజరాత్​ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువునష్టం కేసులో స్టే కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. దీనిని పరిశీలించిన హైకోర్టు.. స్టేకు నిరాకరించింది. దీంతో కేజ్రీవాల్​ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పిటిషన్​ను పరిశీలించిన సుప్రీం.. ఆగస్టు 29న హైకోర్టు తీర్పు వెలువరిస్తుందని స్పష్టం చేసింది.