Politics

రాష్ట్రంలో రెండు కొత్త మండలాలు ఏర్పాటు

రాష్ట్రంలో రెండు కొత్త మండలాలు ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలను, ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ తుది నోటిఫికేషన్‌నూ విడుదల చేసింది. కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్‌ను నూతన మండలంగా, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలోని బొగారం గ్రామ పరిధిలో ఉన్న బార్సిగూడను నూతన రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుచేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ ఏర్పాటుపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని నోటిఫికేషన్లలో పేర్కొంది.