DailyDose

నేటి నుంచి ఎంసెట్ బైసిపి విద్యార్థులకు కౌన్సెలింగ్

నేటి నుంచి ఎంసెట్ బైసిపి విద్యార్థులకు కౌన్సెలింగ్

ఎంసెట్‌ అగ్రికల్చర్‌ విభాగంలో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు బీఫార్మసీ, ఫార్మా డి తదితర సీట్లను కేటాయించేందుకు ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబరు 2వ తేదీన అభ్యర్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, 4 నుంచి 7వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ఉంటుంది. మొత్తం అయిదు రకాల కోర్సుల్లో 8,312 సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు.