Politics

తుమ్మలతో పొంగులేటి భేటీ

తుమ్మలతో పొంగులేటి భేటీ

అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారింది. భారాస టికెట్‌ దక్కకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అడుగులు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని ఆయన నివాసం వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

తుమ్మలతో పొంగులేటి భేటీ
తుమ్మల పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అనుచరులు, అభిమానులతో చర్చించి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని తుమ్మల ఇదివరకే తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తనను ఆహ్వానించిందని.. అయితే అభిమానుల అభిప్రాయానికనుగుణంగా నడుచుకుంటానన్నారు. ఈ క్రమంలో తుమ్మల నివాసానికి కాంగ్రెస్‌ నేత పొంగులేటి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై ఆయనతో చర్చించారు.