Business

19 నుంచి కాచిగూడ నుంచి కాకినాడకు స్పెషల్ ట్రైన్స్

19 నుంచి కాచిగూడ నుంచి కాకినాడకు స్పెషల్ ట్రైన్స్

దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ-కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్ల (dussehra special Trains)ను నడపనున్నారు. ఈ నెల 19, 26 తేదీల్లో కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు(07653) రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 20, 27 తేదీల్లో కాకినాడ పట్టణం నుంచి ప్రత్యేక రైలు(07654) సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. ఇది మల్కాజిగిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z