Devotional

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 56,723 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 21,778 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లుగా ఉంది.నవంబర్ 19న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం జరుగుతుంది. 18న పుష్పయాగానికి అంకురార్పణ జరుగుతుంది. పుష్పయాగం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, ఆర్జితసేవలు రద్దు చేశామని టిటిడి వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z