DailyDose

నదుల అనుసంధానంపై నేడు కీలక భేటీ

నదుల అనుసంధానంపై నేడు కీలక భేటీ

జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం వేగం పెంచుతోంది. గోదావరికృష్ణా నదుల అనుసంధానంతోపాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో నదుల అనుసంధాన ప్రక్రియకు సబంధించి భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించి ఈ అంశంపై ముందుకు వెళ్లేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీ మరో మారు సమావేశం కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్న ఈ కమిటీ అందుకు జలసౌధను వేదికగా ఎంచుకుంది.

కేంద్ర జలసంఘం చైర్మన్ , ఎన్‌డబ్యుడిఏ డైరెక్టర్ జనరల్ , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కర్ణాటక ,చత్తిస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులు ఈ టాస్క్‌పోర్స్ సమావేశంలో పాల్గొననున్నారు. గోదావరి(ఇచ్చంపల్లి), కావేరి (గ్రాండ్ అనికట్) నదుల అనుసంధాన ప్రక్రియలలో భాగంగా ఈ కీలక సమావేశం జరగనుంది. కెన్, బెత్వా నదుల అనుసంధానం, పర్బగి, కాలిసంద్, చంబల్ ప్రాజెక్టు, కొసి, మేచి లింక్ ప్రాజెక్టు, మహానది, గోదావరి నదుల అనుసంధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం డిపిఆర్ మార్పులపై కూడా చర్చించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z