Politics

ఏపీ దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా కేంద్ర ప్రకటన

ఏపీ దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా కేంద్ర ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో ఘనత సాధించింది. ఏపీని దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్‌తో పాటు అవార్డును ప్రదానం చేయనున్నారు.

కాగా గతంలోనూ మన రాష్ట్రం ఇదే అవార్డును దక్కించు­కోవడం విశేషం. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ శాఖ అధికారులు, సిబ్బందికి ట్విట్టర్‌ ద్వారా శనివారం అభినందనలు తెలిపారు.

https://i.imgur.com/YI7yz19.jpg

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z