Politics

అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌

అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌

తెలంగాణలో రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. శనివారం మధ్యాహ్నం గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు.ఇచ్చిన హామీలను కేసీఆర్‌ నిలబెట్టుకోలేదు. గద్వాల పేదలకు 500 ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్‌ మోసం చేశారు. అబద్ధపు మాటలతో కేసీఆర్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తి చేయలేదు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ టైం అయిపోయింది.. బీజేపీ టైం వచ్చింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది అని షా ప్రసంగించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z