Business

ఐటీ దిగ్గజ సంస్థ విప్రో షాకింగ్ నిర్ణయం

ఐటీ దిగ్గజ సంస్థ విప్రో షాకింగ్ నిర్ణయం

ఐటీ దిగ్గజ సంస్థ విప్రో.. బెంగళూరు, హైదరాబాద్‌లలో తన రెండు కార్యాలయాలకు చెందిన ఆస్తులను విక్రయించాలని భావిస్తోందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. తన ప్రధానేతర స్థిరాస్తులను అమ్మడం ద్వారా వచ్చిన నగదును, కార్యకలాపాల స్థిరీకరణ కోసం వినియోగించాలని భావిస్తోందని ఆ కథనం తెలిపింది. హైబ్రిడ్‌ పని విధానం వల్ల కార్యాలయాల అవసరం తగ్గినందున, వేర్వేరు నగరాల్లోని కార్యకలాపాలను స్థిరీకరించడం కోసం ఈ నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 14 ఎకరాలు, బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీలో ఉన్న 25 ఎకరాలను విక్రయించేందుకు సంస్థ మదింపు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమని విప్రో ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z