Politics

దిల్లీ కాలుష్యమంతా హైదరాబాద్‌ను కమ్మేసింది!

దిల్లీ కాలుష్యమంతా హైదరాబాద్‌ను కమ్మేసింది!

కాంగ్రెస్‌ వస్తే.. మళ్లీ స్కామ్‌లు తప్పవని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాజేంద్రనగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దిల్లీ కాలుష్యమంతా హైదరాబాద్‌ను కమ్మేసిందని పరోక్షంగా కాంగ్రెస్‌, భాజపా జాతీయ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు వచ్చిన ఆ నేతలంతా 3 రోజుల తర్వాత మళ్లీ కనిపించరన్నారు. దిల్లీ కాలుష్యాన్ని ఇంకా మూడు రోజులు భరించాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ గెలిస్తే.. రాష్ట్రంలో మళ్లీ కరెంట్‌ కోతలు తప్పవని చెప్పారు.

‘‘ఒకప్పుడు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’ అనే పాటలు ఉండేవి. ఇప్పుడు ‘నేను వెళ్తా బిడ్డో… సర్కార్‌ దవాఖానాకు’ అని పాడుకుంటున్నారు. హైదరాబాద్‌ ఎంత అభివృద్ధి చెందిందో మీరే చూస్తున్నారు. మళ్లీ భారాస గెలిస్తే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. అందుకే ప్రజలందరూ ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి. ’’ అని హరీశ్‌రావు అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z