Politics

ఈ పదేళ్లలో భారాస ఏం చేసిందో కేసీఆర్‌ చెప్తారా?

ఈ పదేళ్లలో భారాస ఏం చేసిందో కేసీఆర్‌ చెప్తారా?

భారాస పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆందోల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆదాయమంతటినీ కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ‘‘ల్యాండ్‌, సాండ్‌, మైన్స్‌, వైన్స్‌ అంతా కేసీఆర్‌ కుటుంబం చేతిలోనే ఉంది. ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములను గుంజుకున్నారు. పరీక్ష పేపర్ల లీక్‌ వల్ల ఎంతో మంది యువత నష్టపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. ఈ పదేళ్లలో భారాస ఏం చేసిందో కేసీఆర్‌ చెప్తారా?’’ అని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z