లండన్లో దీక్షా దివస్ను బీఆర్ఎస్-యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన శాంతియుత పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చుడో- కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తలపెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి.. శాంతియుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించిన పెట్టిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని ఈ సందర్భంగా ఎన్నారైలు కొనియాడారు. నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్ధతినే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పాటించారని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎలాంటి హింసకు తావులేకుండా, శాంతియుతంగా ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికే గొప్ప సందేశాన్ని, మార్గాన్ని చూపిన గొప్ప స్ఫూర్తిదాత మన కేసీఆర్ అని ప్రశంసించారు. ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా.. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం అదృష్టమన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ సభ్యులు రవి ప్రదీప్ పులుసు, రవి రేటినేని, సురేశ్ గోపతి, హరి గౌడ్ నవాపేట్, సతీష్ రెడ్డి బండ, మల్లారెడ్డి బీరం, వెంకట్ రెడ్డి దొంతుల, ప్రశాంత్ కటికనేని, శ్రీకాంత్ జెల్లా, నవీన్ భువనగిరి, అబ్దుల్ జాఫర్, గణేశ్ కుప్పల, ప్రశాంత్ మామిడాల, రామకృష్ణ , ముఖ్య సభ్యులు శుషుమ్న రెడ్డి, క్రాంతి రేటినేని,సుప్రజ పులుసు, స్నేహ నవాబుపేట్, మట్టా రెడ్డి, నవీన్, అంజన్ రావు, శశి, నరేష్ జక్కుల హాజరయ్యారు.
👉 – Please join our whatsapp channel here –