Politics

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉద్రక్తతపై స్పందించిన అంబటి

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉద్రక్తతపై స్పందించిన అంబటి

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఉద్రక్తతపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు.. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారు.. మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి ఎందుకు?.. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. సాగు నీరు కోసం పదే పదే తెలంగాణ రాష్ట్రం అనుమతి తీసుకోవాలా? అంటూ మండిపడ్డారు. మా వాటాకు మించి ఒక్క నీటి చుక్క వాడుకోలేదు.. ఇది చాలా సున్నీతమైన అంశం, గొడవలు అవసరం లేదు.. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేశారు అంటూ ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో చంద్రబాబు సర్కార్ ఫెయిలైతే.. ఇప్పుడు జగన్ సర్కార్ సక్సెస్ అయింది అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ వివాదం చంద్రబాబు టైమ్ లోనూ జరిగింది.. సాగర్ కుడి కెనాల్ ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధం.. మా వాటాను మేము వాడుకునే స్వేచ్ఛ మాకు కావాలి.. పురంధేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారు.. ఏపీ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అసమర్థత వల్ల తెలంగాణ పోలీసులు.. ఏపీ భూభాగంలోకి వచ్చారు.. తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన, ఓడించాల్సిన అవసరం మాకు లేదు.. తెలంగాణ రాజకీయాలపై మాకు ఆసక్తి లేదు.. ఎవరు అధికారంలోకి వచ్చిన మాకు సంబంధం లేదు.. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ కు చంద్రబాబు మద్దతు ఇచ్చారా?.. చంద్రబాబుకు చెందిన కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z