తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –