రాష్ట్ర మంత్రులకు శాఖలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేటాయించారు. ఇందుకోసం శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్లతో రేవంత్ సుదీర్ఘ భేటీలు నిర్వహించారు.
ఆర్థిక, ఇంధన శాఖ – భట్టి విక్రమార్క
వ్యవసాయ శాఖ – తుమ్మల నాగేశ్వరరావు
ఎక్సైజ్ శాఖ – జూపల్లి కృష్ణారావు
నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
వైద్య, ఆరోగ్య శాఖ – దామోదర రాజనర్సింహ
ఆర్అండ్బీ శాఖ – కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఐటీ, అసెంబ్లీ వ్యవహారాలు శాఖ – దుద్దిళ్ల శ్రీధర్బాబు
రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ – పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
రవాణా, బీసీ సంక్షేమ శాఖ – పొన్నం ప్రభాకర్
పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ – సీతక్క
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ – కొండాసురేఖ
👉 – Please join our whatsapp channel here –