DailyDose

విజయవాడ తిరుపతిలో రైల్వే కన్‌స్ట్రక్షన్‌ అకౌంట్స్‌ కార్యాలయాల మూసివేత

విజయవాడ తిరుపతిలో రైల్వే కన్‌స్ట్రక్షన్‌ అకౌంట్స్‌ కార్యాలయాల మూసివేత

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు కొలిక్కి రాకపోవడంతో ఏపీలోని రైల్వేశాఖకు చెందిన వివిధ విభాగాల కార్యాలయాలు సికింద్రాబాద్‌కు తరలిపోతున్నాయి. దక్షిణ మధ్యరైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌కు ఒక్కో విభాగాన్ని విలీనం చేస్తూ, ఇక్కడి కార్యాలయాలను మూసివేస్తున్నారు. విజయవాడ, తిరుపతిలో ఉన్న రైల్వే కన్‌స్ట్రక్షన్‌ అకౌంట్స్‌ కార్యాలయాలను మూసివేసి వాటిని ప్రధాన కేంద్రంలో విలీనం చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈనెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తికావాలని, జనవరి ఒకటి నుంచి వీటి కార్యకలాపాలు సికింద్రాబాద్‌ నుంచే జరగాలని కొద్దిరోజుల కిందట జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లలో జరిగే రైల్వే నిర్మాణ పనులు అన్నింటికీ.. కన్‌స్ట్రక్షన్స్‌ అకౌంట్స్‌ విభాగం నుంచి చెల్లింపులు జరిపేందుకు గతంలో విజయవాడ, తిరుపతిలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. నిర్మాణ పనుల బిల్లులను ఈ కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో పంపిస్తే, వాటిని పరిశీలించి చెల్లింపులు చేస్తుంటారు. ఇప్పుడు ఈ రెండు కార్యాలయాలు మూసివేయడంపై ఉద్యోగులు విస్తుపోతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z