Business

తమిళనాడులో మరో ఆరు వేల కోట్ల పెట్టుబడులు-వాణిజ్య వార్తలు

తమిళనాడులో మరో ఆరు వేల కోట్ల పెట్టుబడులు-వాణిజ్య వార్తలు

* 10నుంచి యూపీఏ కొత్త సర్వీస్

దేశంలో యూపీఏ పేమెంట్లను మరింత వేగవంతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రజలకు కొత్త సదుపాయాన్ని అందించింది. 10 జనవరి 2024 నుండి ఆసుపత్రులు, విద్యా సేవలకు యూపీఐ లావాదేవీల పరిమితి పెంచబడింది. ఇప్పుడు రూ.5 లక్షల వరకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత నెలలో ఆసుపత్రులు, విద్యా సేవలలో రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేయవచ్చని ఆదేశించింది. ఇంతకుముందు, ఈ రంగాలలో యూపీఐ చెల్లింపుకు సంబంధించి ప్రజలు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్‌పిసిఐ బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యుపిఐ దరఖాస్తులను పరిమితిని పెంచాలని ఆదేశించింది.గతంలో యూపీఐ పరిమితి రూ.1 లక్ష ఉండగా, ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచారు. ధృవీకరించబడిన వ్యాపారులకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుంది. వ్యాపారులు యూపీఐని పేమెంట్ మోడ్‌గా ఇంట్రడ్యూస్ చేయడం అవసరం. యూపీఐ ఒక రోజు పరిమితి రూ. 1 లక్షగా నిర్ణయించబడింది. డిసెంబర్ నెలలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీలో ఆర్‌బీఐ యూపీఐ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఈ సదుపాయం Paytm, Google Pay, PhonePe యాప్‌ల వంటి UPI అన్ని సపోర్టింగ్ యాప్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. అన్ని బ్యాంకుల్లోని ఖాతాదారులకు కూడా ఈ సౌకర్యం కల్పించనున్నారు.UPI లావాదేవీల బూమ్..దేశంలో యూపీఐ చెల్లింపులు పెరిగాయి. 2023 నాటికి ఇది 100 బిలియన్లను దాటుతుంది. NPCI విడుదల చేసిన డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో సుమారు 126 కోట్ల UPI చెల్లింపులు జరిగాయి. గత సంవత్సరం 2023లో యూపీఐ చెల్లింపులు 60 శాతం పెరిగాయి.

* తమిళనాడులో మరో ఆరు వేల కోట్ల పెట్టుబడులు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India) తమిళనాడు (TamilNadu)లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రాష్ట్రంలో మరో రూ.6,180 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సోమవారం తెలిపింది. తమిళనాడు ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ 2024’ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ మొత్తం గతంలో ప్రకటించిన పెట్టుబడులకు అదనమని వెల్లడించింది.హ్యుందాయ్‌ సంస్థ రాబోయే పదేళ్లలో (2023-2032) తమిళనాడులో రూ.20 వేల కోట్లతో విద్యుత్తు వాహనాల (EV) తయారీ, ఈవీ ఛార్జింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపాటు నైపుణ్య శిక్షణ కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు గతంలో ప్రకటించింది. రాష్ట్రంలో సామాజిక-ఆర్థికాభివృద్ధిని పెంపొందించేందుకు తమ సంస్థ నిబద్ధతకు ఈ పెట్టుబడులు నిదర్శనమని హ్యుందాయ్‌ ఎండీ ఉన్‌సూ కిమ్‌ తెలిపారు.పెట్టుబడుల్లో భాగంగా ఈ సంస్థ రూ.180 కోట్లతో ఐఐటీ మద్రాస్‌తో కలిసి తమిళనాడులో హైడ్రోజన్‌ వ్యాలీ ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. భారత్‌లో ఈ సంస్థకు చెన్నై నగరం శివారులో అతి పెద్ద తయారీ యూనిట్‌ ఉంది. ఏటా ఇక్కడి నుంచి 8 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తోంది.

* మార్కెట్‌లోకి బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ (Mercedes-Benz) తన ప్రీమియం ఎస్‌యూవీ మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ (Mercedes-Benz GLS facelift) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు ట్రిమ్స్, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ కారు. మెర్సిడెజ్-బెంజ్ జీఎల్ఎస్ ఫేస్ లిఫ్ట్ ‘జీఎల్ఎస్ 450’ వేరియంట్ కారు ధర రూ.1.32 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలికితే, ‘జీఎల్ఎస్ 400 డీ’ వేరియంట్ రూ.1.37 కోట్లు పలుకుతుంది. వీటితోపాటు కంపెనీ రూ.85 వేల విలువైన సర్వీసింగ్ ప్యాకేజీ అందిస్తున్నది.

* ఒక్క సెకనులో 6600 కోట్లు

టాటా గ్రూప్ తన కంపెనీల త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం ప్రారంభించింది. ఆభరణాలు, కళ్లద్దాలను విక్రయించే టైటాన్ కంపెనీ గ్రూప్ శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. దీని ప్రభావం ఈరోజు సోమవారం కంపెనీ షేర్లలో కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే, కంపెనీ షేర్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒక్క సెకనులో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6600 కోట్లు పెరిగింది. రెండవ త్రైమాసికంలో దీపావళి కారణంగా కంపెనీ ఆదాయం, లాభంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కంపెనీ షేర్లు ఏ స్థాయికి చేరుకున్నాయి.. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుందాం.
కంపెనీ రికార్డు సృష్టించింది..బాంబే స్టాక్ ఎక్సేంజ్ గణాంకాల ప్రకారం టైటాన్ షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం కంపెనీ షేర్లు రూ.3710.05 వద్ద ముగిశాయి. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే కంపెనీ షేర్లు రికార్డు స్థాయి రూ.3,784.25కి చేరాయి. అంటే కంపెనీ షేర్లలో దాదాపు 2 శాతం జంప్‌ జరిగింది. ప్రస్తుతం కంపెనీ షేర్లు మధ్యాహ్నం 12:05 గంటలకు రూ.3722 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు కూడా రూ.3706.45 కనిష్ట స్థాయికి చేరాయి.ఒక్క సెకనులో రూ.6600 కోట్లు ప్రారంభమైన వెంటనే కంపెనీ షేర్లు, మార్కెట్ క్యాప్‌లో కూడా బలమైన పెరుగుదల కనిపించింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,29,373.10 కోట్లుగా ఉంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే రూ.3,35..,960.47 కోట్లకు చేరుకుంది. అంటే కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రూ.6,587.37 కోట్ల వృద్ధి నమోదైంది. ప్రస్తుతం కంపెనీ షేర్లు స్వల్పంగా క్షీణించాయి. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా తగ్గింది.ఒక సంవత్సరంలో 50 శాతం రాబడి
అయితే గత ఏడాది కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 50 శాతం రాబడిని ఇచ్చాయి. గత 6 నెలల్లో 22 శాతం వృద్ధి కనిపించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సంస్థ లెక్కల పుస్తకం చాలా బలంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని ఇచ్చింది. రానున్న నెలల్లో కంపెనీ షేర్లు పెరిగే అవకాశం ఉంది. రానున్న కాలంలో కంపెనీ షేర్లు రూ.4200కు చేరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* దిల్లీ శివారులోని విలువైన లగ్జరీ ఫ్లాట్ల అమ్మకం

ఈ మధ్య ఇళ్లను కొనుగోలుచేసేవారి అభిరుచులు మారుతున్నాయి. కేవలం నివాసానికి మాత్రమే అని చూడకుండా.. ఇంట్లో సకల సౌకర్యాలు, అధునాతన హంగులు ఉండాలనుకుంటున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తులు లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలా విలాసవంతమైన గృహాలకు గిరాకీ పెరుగుతోంది. తాజాగా రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ (DLF)కు చెందిన ఓ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుకు ప్రీ-లాంచ్‌లో మంచి డిమాండ్‌ దక్కింది. కేవలం 72 గంటల్లోనే రూ.7,200 కోట్ల విలువైన 1,113 ఫ్లాట్లు (luxury flats) అమ్ముడయ్యాయి.ఈ విషయాన్ని డీఎల్‌ఎఫ్‌.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. గురుగ్రామ్‌ (Gurugram)లోని 76, 77 సెక్టార్లలో కొత్తగా నిర్మించబోయే ‘డీఎల్‌ఎఫ్‌ ప్రివానా సౌత్‌’ లగ్జరీ రెసిడెన్షియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రీ-లాంచ్‌ నిర్వహించారు. నిర్మాణానికి ముందే ఫ్లాట్లన్నీ అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. కేవలం మూడు రోజుల్లోనే కస్టమర్లు వీటిని బుక్‌ చేసుకున్నట్లు పేర్కొంది.మొత్తంగా 25 ఎకరాల్లో ఈ అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నారు. 7 టవర్లలో 1,113 విలాసవంతమైన నివాసాలను నిర్మించనున్నట్లు కంపెనీ తెలిపింది. బుకింగ్‌ ధర రూ.50లక్షలుగా నిర్ణయించారు. ఒక్కో కొనుగోలుదారు ఒక ఫ్లాట్‌ను మాత్రమే బుక్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇళ్లను కొనుగోలు చేసిన వారిలో 25శాతం మంది ఎన్‌ఆర్‌ఐలేనని కంపెనీ వెల్లడించింది.గతేడాది మార్చిలోనూ డీఎల్‌ఎఫ్‌ ఇలా లగ్జరీ అపార్ట్‌మెంట్లకు ప్రీ-లాంచ్‌ నిర్వహించింది. అప్పుడు కూడా కేవలం మూడు రోజుల్లోనే రూ.8000 కోట్లకు పైగా విలువైన 1,137 ఫ్లాట్లను విక్రయించింది. వీటిలో ఒక్కో ఇంటి ధర రూ.7కోట్లకు పైమాటే..!

* డ్రగ్స్‌ ఆరోపణలపై స్పందించిన మస్క్‌

తరచూ డ్రగ్స్‌ (Durgs) తీసుకుంటున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై అమెరికన్‌ టైకూన్‌, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తాజాగా స్పందించారు. రోగన్‌తో కలిసి గతంలో ఓసారి డ్రగ్స్‌ సేవించిన విషయం నిజమేనని చెప్పారు. ఆ తర్వాత తాను డ్రగ్స్‌ తీసుకోలేదని స్పష్టం చేశారు. నాసా అభ్యర్థనతో టెస్లా ఆఫీసును డ్రగ్స్ రహితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ అభ్యర్థన మేరకు గత మూడేళ్లుగా తాను వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఈ మూడేళ్లలో తన శరీరంలో డ్రగ్స్ కానీ, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లూ గుర్తించలేదని మస్క్ వివరించారు.కాగా, మస్క్‌ తరచూ నిషేధిత డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్‌ పాల్గొంటూ.. అక్కడ డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని అమెరికాకు చెందిన వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనాన్ని ప్రచురించింది. దీని వల్ల మస్క్‌ ఆరోగ్యంతోపాటు ఆయన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నదని ఆ సంస్థల డైరెక్టర్ల బోర్డు సభ్యులు ఆందోళన చెందుతున్నట్టు ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనంపై స్పందించిన మస్క్‌.. పై విధంగా వివరణ ఇచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z