DailyDose

అయోధ్య రామాలయ ప్రారంభం రోజునే కాన్పులు కావాలంట

అయోధ్య రామాలయ ప్రారంభం రోజునే కాన్పులు కావాలంట

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో అదేరోజున తమకు సిజేరియన్‌ ప్రసవం చేయాలని పలువురు గర్భిణులు వైద్యులను కోరుతున్నారు. ప్రసవ తేదీ దగ్గరపడ్డ మహిళలు ఆ చరిత్రాత్మక రోజును చిరస్మరణీయంగా మలచుకోవాలని ఆశిస్తున్నారు. ఈ విషయమై కాన్పుర్‌ వైద్య కళాశాల గైనకాలజీ విభాగ ఇన్‌ఛార్జి డాక్టర్‌ సీమా ద్వివేదీ ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా మా ఆస్పత్రిలో ప్రతిరోజూ 12 నుంచి 20 ప్రసవాలు జరుగుతాయి. జనవరి 22న సిజేరియన్‌ ఆపరేషన్లు చేయాలని ఇప్పటికే 12 నుంచి 14 లిఖితపూర్వక వినతులు అందాయి. 35 ఆపరేషన్లకు మేము ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. అయితే, దీనికోసం గర్భిణుల ఆరోగ్య పరిస్థితి కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’’ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z