Politics

తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు పేద ప్రజల కోసమే

తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు పేద ప్రజల కోసమే

ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని పేదల అభ్యున్నత కోసమే స్థాపించారని, అప్పటికి ఇప్పటికి పార్టీ పేదలకు గొడుగులా నీడనిస్తోందని కమ్మసంఘం జిల్లా కార్యదర్శి దామోదర్‌ చౌదరి, కమ్మనాయకుడు ఎస్‌.వెంకటనాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా బళ్లారి(Ballari) కమ్మ భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఎన్‌.టీ.ఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈసందర్బంగా వెంకటనాయుడు మాట్లాడుతూ దివంగత నేత నందమూరి తారాక రామరావు యుగపురుషుడని, ప్రజల కోసం పార్టీని స్థాపించి ప్రజలకు అండగా నిలిచారన్నారు. తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు పేద ప్రజల కోసమే పనిచేస్తోందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం గెలవడానికి ప్రవాసాంద్రులంతా తమ వంతు కృషి చేస్తారన్నారు. ఈకార్యక్రమంలో వీరితో పాటు అభిలాష్‌, శ్రీన, జి.రమేశ్‌, రవి, నాగభూషణ, జయప్రకాశ్‌, వై.,ఎర్రిస్వామి, వై. శీనా, నీలం ప్రసాద్‌చౌదరి, శేషగిరిరావు, రఘు, పైయ్యావుల శీనప్ప,రాము, రవికుమార్‌, జే.ఆంజనేయులు, ఎం.గోపాల్‌, శాంబశివరావు, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z