Politics

ఇకముందు అసలు సినిమా చూపిస్తాం!

ఇకముందు అసలు సినిమా చూపిస్తాం!

కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కేవలం భారాస వల్లే సాధ్యం అవుతుందన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్‌ శాఖలో అవినీతి జరిగిందని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీకి ట్రైలర్‌ చూపించాం. ఇకముందు అసలు సినిమా చూపిస్తాం. పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తాం. అక్రమ కేసుల నుంచి వారిని కాపాడేందుకు లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z