Politics

సచివాలయ ఆవరణలో ధర్నాలు.. ర్యాలీలపై నిషేధం

సచివాలయ ఆవరణలో ధర్నాలు.. ర్యాలీలపై నిషేధం

రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతులను నిలిపివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతులపై ఇటీవల ఉద్యోగ సంఘాలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించిన నేపథ్యంలో ఈ నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. కొంతమంది ఉద్యోగులు తరచు సచివాలయ ప్రాంగణంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారని, ఇటీవల సీఎస్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిని కొందరు దూషించారని, కార్యాలయం ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని వెల్లడించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని, ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌-1991 ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z