NRI-NRT

ఎన్నారైలను అవమానించడం తగదు:జయరాం

ఎన్నారైలను అవమానించడం తగదు:జయరాం

కష్టకాలంలో ఆప‌న్న హ‌స్తం అందించే ఎన్నారైలపై వైకాపా నాయ‌కులు విమ‌ర్శ‌లు చేయ‌డం, బెదిరింపుల‌కు పాల్పడటం దారుణ‌మ‌ని ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జ‌య‌రాం కోమ‌టి అన్నారు. అధికార పార్టీ నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారైల‌ను బెదిరిస్తూ బాప‌ట్ల జిల్లా వేమూరు నియోజ‌క‌వ‌ర్గం వైకాపా అభ్య‌ర్థి వ‌రికూటి అశోక్ బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌య‌రాం కోమ‌టి ఖండించారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తున్న ఎన్నారైల‌ను తీవ్రంగా అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్య‌లు స‌రికాద‌న్నారు. రాష్ట్రానికి ఎన్నారైల నుంచి అనేక విధాలుగా మేలు జరుగుతోందని, ఉద్యోగ క‌ల్ప‌న‌, ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త‌, మురికివాడల అభివృద్ది, గ్రామీణ ప్రాంతాల ద‌త్త‌త‌, విద్య‌, వైద్యం వంటి అనేక రంగాల్లో ఎన్నారైలు కృషి చేస్తోన్న విష‌యాన్ని వివ‌రించారు. ఇలాంటి వ్యాఖ్య‌లు వైకాపా నేత‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z