NRI-NRT

ఘనంగా చికాగో ఆంధ్ర సంఘం(CAA) 8వ వార్షికోత్సవం

ఘనంగా చికాగో ఆంధ్ర సంఘం(CAA) 8వ వార్షికోత్సవం

చికాగో ఆంధ్ర సంఘం (ఛాఆ) 8వ వార్షికోత్సవాన్ని శనివారం నాడు చికాగోలోని యెల్లో బాక్స్ (Yellow Box) ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి సహకారంతో ఈ వేడుకలు నిర్వహించారు. 1100 మందికి పైగా చికాగో ప్రవాసులు హాజరయ్యారు.

కర్ణాటక సంగీత సాంప్రదాయ గీతాలు, కృతులు, కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలు, ఆధునిక చలనచిత్ర గీత నృత్యాలు, నాటికలు అలరించాయి. ఈ కార్యక్రమానికి సహాయ కాన్సల్ జనరల్ ఆఫ్‌ ఇండియా సంజీవ్ పాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రముఖ విద్యావేత్త డా.॥ రత్నం చిట్టూరికి జీవిత సాఫల్య పురస్కారం అందించారు. అందరికీ విద్య అందించాలనే ఆశయంతో “నార్త్ సౌత్ ఫౌండేషన్”ను స్థాపించి ఎందరో విద్యార్థుల అభివృద్ధికి దోహదపడినందుకు శ్లాఘించారు.

నరేశ్ చింతమాని ఆధ్వర్యంలో తెలుగు విందు భోజనం ఏర్పాటు చేశారు. సంస్థ కార్యదర్శి గిరిరావు కొత్తమాసు వేడుకల విజయవంతానికి కృషిచేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా, భారతదేశాల జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిశాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z