Devotional

రేపు తితిదే డయల్ యువర్ ఈఓ

రేపు తితిదే డయల్ యువర్ ఈఓ

తిరుమల,తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న ఆలయాల్లో సౌకర్యాల కల్పన, ఇతర సమస్యలను విన్నవించడానికి ఈనెల 3న డయల్‌యువర్‌ ఈవో (Dial Your EO) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో భక్తులు నేరుగా ఫోన్‌ ద్వారా తమ సమస్యలను ఈవో ధర్మారెడ్డికి వివరించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని వివరించారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను నెంబరు 0877-2263261 ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని వెల్లడించారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆరు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 72,310 మంది భక్తులు దర్శించుకోగా 28,731 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.59 కోట్లు వచ్చిందన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z