NRI-NRT

డీసీలో ఎన్నారై తెదేపా సంబరాలు

డీసీలో ఎన్నారై తెదేపా సంబరాలు

ఏపీలో తెలుగుదేశం కూటమి సాధించిన అఖండ విజయాన్ని స్వాగతిస్తూ.. ప్రవాసులు, వారి తల్లిదండ్రులు, మహిళలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో సంబరాలు జరుపుకున్నారు. ఎన్నారై తెలుగుదేశం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు మాట్లాడుతూ ప్రాంతాలకతీతంగా తెదేపాను ప్రజలు కోరుకున్నారని..ముఖ్య భూమిక పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇది తెలుగు ప్రజల విజయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీలిమ చనుమోలు, తేజస్వి, సుధీర్ కొమ్మి, యువ సిద్ధార్ధ్ బోయపాటి, చక్రవర్తి పయ్యావుల, రమేష్ అమిర్నేని, భాను ఆకర్ష్, వీర్రాజు, సత్యనారాయణరాజు, జ్యోతి ప్రకాష్ సీతారామారావు, రామకృష్ణ, ప్రదీప్, అజయ్, వినీల్, మురళి, మనోజ్, అంకిత తదితరులు పాల్గొన్నారు.

Jp7fXhG.md.jpg

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z